: 20 ఏళ్ల నాటి కేసులో ఇప్పుడు చిక్కుల్లో పడ్డ గోవిందా, శిల్పాశెట్టి

రెండు దశాబ్దాల నాటి ఓ కేసులో ఈ నెల 18న కోర్టుకు హాజరు కావాల్సిందేనంటూ జార్ఖండ్ లోని పాకూర్ కోర్టు నటుడు గోవిందా, నటి శిల్పాశెట్టిలను ఆదేశించింది. 1996లో విడుదలైన 'ఛోటే సర్కార్' చిత్రంలో గోవిందా, శిల్పాశెట్టిల జంట కలసి నటించగా, బీహార్, యూపీలను కించపరుస్తూ, ఇందులో ఓ పాటను చిత్రీకరించారని ఓ న్యాయవాది కోర్టులో కేసు వేశారు. హీరో హీరోయిన్లతో పాటు పాట పాడిన గాయకుడు, దర్శకుల పైనా కేసు వేశారు. ఆ తరువాత బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా కేసు ఏళ్ల తరబడి వాయిదాలపై వాయిదాలతో సాగింది. ఎన్నిసార్లు కోర్టు ఆదేశించినా చిత్రానికి సంబంధించిన ఎవరూ కోర్టుకు రాలేదు. దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పాకూర్ కోర్టు న్యాయమూర్తి, వీరిని తీసుకురావాల్సిందేనని ముంబై పోలీసులను ఆదేశించింది.

More Telugu News