: హార్దిక్ పాండ్యా వన్డేల్లోకి రంగ ప్రవేశం... టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా

ధర్మశాలలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని, చీకటి పడ్డా పిచ్ పై పెద్దగా మార్పుండదన్న ఉద్దేశంతోనే ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నామని ధోనీ వ్యాఖ్యానించాడు. సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేసి ఇండియాను ఒత్తిడిలోకి నెడతామని, ఆ తరువాత తమ బౌలర్లు మిగతా పని కానిస్తారని న్యూజిలాండ్ కెప్టెన్ కేఎస్ విలియమ్సన్ అన్నాడు. భారత జట్టులో మన్ దీప్ సింగ్, జయంత్ యాదవ్, ధవల్ కులకర్ణిలను పక్కన బెట్టిన మేనేజ్ మెంట్ తొలి వన్డే ఆడే అవకాశాన్ని హార్దిక్ పాండ్యాకు కల్పించింది. మరికాసేపట్లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది.

More Telugu News