: హంద్వారాలో చెలరేగిన ఉగ్రవాదులు.. పోలీస్ కాన్వాయ్‌పై దాడి

సర్జికల్ దాడులతో పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పినా ఉగ్రవాదుల వైఖరిలో మార్పు రావడం లేదు. మొన్న సహస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) కాన్వాయ్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు శనివారం రాత్రి పొద్దుపోయాక జమ్ముకశ్మీర్ పోలీసు కాన్వాయ్‌పై దాడి చేసి కాల్పులకు తెగబడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు దాడిని సమర్థంగా తిప్పి కొట్టారు. శుక్రవారం జకురాలో ఎస్ఎస్‌బీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ జవాను అమరుడు కాగా మరో 8 మంది గాయపడ్డారు.

More Telugu News