: రజనీకాంత్ ను కలిసిన థాయ్ ల్యాండ్ యువరాణి
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ను థాయ్ ల్యాండ్ యువరాణి మామ్ లుయాంగ్ రాజాధరశ్రీ జయంకుర కలిశారు. వీరిద్దరూ దాదాపు అరగంటకు పైగా సమావేశం కాగా, పలు అంశాలను మామ్ లుయాంగ్ రజనీ వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. రజనీ తాజా చిత్రం 'కబాలీ'లోని పలు సీన్లను థాయ్ ల్యాండ్ లో చిత్రీకరించిన విషయం తెలిసిందే. తమ దేశంలో రజనీకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారని చెప్పిన ఆమె, ఆయన్ను ఇలా ప్రత్యక్షంగా కలవడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. రజనీకాంత్, మామ్ లుయాంగ్ ల సమావేశం గురించి రజనీ కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.