: పాస్ పోర్ట్ ఫొటోలకు కొత్త నిబంధనలు విధించిన అమెరికా

పాస్ పోర్ట్ కోసం అప్లై చేసే వారు ఫొటోల విషయంలో కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటించి తీరాలని అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ తెలిపింది. కొత్తగా పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కొత్త నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం పాస్ పోర్టు కోసం అప్లై చేసే సమయంలో జత చేసే ఫొటోల్లో ఎలాంటి విపరీత హావభావాలు ఉండరాదు. అంతేకాదు, కళ్ల జోడు పెట్టుకోకూడదు. కళ్లజోడు పెట్టుకోవడం వల్ల నీడలు, గీతలు వంటి సమస్యలు వస్తున్నాయని... దాంతో, జెట్ సెట్టర్స్ ప్రాసెసింగ్ చాలా ఆలస్యమవుతోందని స్టేట్ డిపార్ట్ మెంట్ తెలిపింది. ఇక ఈ ఏడాది సుమారు 20 మిలియన్ల వరకు పాస్ పోర్ట్ లు జారీ చేయాల్సి రావచ్చని... ఈ క్రమంలో, అనవసర ఆలస్యాన్ని తప్పించుకోవాలంటే కొత్త విధానం చాలా అవసరమని వెల్లడించింది. వైద్యపరమైన సమస్యల వంటి అరుదైన పరిస్థితుల్లో మాత్రం కళ్లద్దాలను అనుమతిస్తామని... అయితే, దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ జత చేయాల్సి ఉంటుందని స్టేట్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు.

More Telugu News