: పాకిస్థాన్ కోరితే ఆ దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేస్తాం: హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌లో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అణచివేయాలని ఆ దేశ ప్రభుత్వం కోరితే తప్పకుండా సాయం చేస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పాకిస్థాన్ కనుక కోరుకుంటే అన్ని రకాలుగా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బెంగళూరులో శుక్రవారం నేషనల్ కాలేజీ మైదానంలో నిర్వహించిన బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఉరీ ఉగ్రదాడి, ఆ తర్వాత పీవోకేలో జరిగిన మెరుపు దాడులు, రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి మాట్లాడారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ నైజం ప్రపంచ దేశాలకు తెలిసిందని, అందుకే ఆయా దేశాలు పాక్‌ను దూరం పెడుతున్నాయని అన్నారు. పాకిస్థాన్‌తో భారత్ సత్సంబంధాలనే కోరుకుంటోందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.

More Telugu News