: పాకిస్థాన్ నటులపై నిషేధం సబబే.. సమర్థించిన శాండల్‌వుడ్

పాకిస్థాన్ నటులపై నిషేధం సబబేనని శాండల్‌వుడ్ నటులు సమర్థించారు. కళ కంటే దేశం గొప్పదని అన్నారు. తొలుత అందరం భారతీయులమని ఆ తర్వాతే కళ అని పేర్కొన్నారు. పాకిస్థాన్ నటీనటులను నిషేధించడం సరైన చర్యేనని కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అన్నారు. డైరెక్టర్ పవన్ ఒడయార్ కూడా నిషేధాన్ని సమర్థించారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు అందరం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. పాకిస్థాన్ నటులను నిషేధించడం ద్వారా సైనికులకు మద్దతు ఇవ్వాలని ప్రముఖ హీరోయిన్ సంజన పేర్కొన్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన మరో హీరో చేతన్, నిర్మాత ఎంఎస్ రమేశ్ తదితరులు కూడా పాక్ నటులపై నిషేధాన్ని సమర్థించారు.

More Telugu News