: ములాయం కుటుంబాన్ని ఎద్దేవా చేస్తూ అమిత్ షా విమర్శలు

ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతూ ఆకట్టుకుంటున్నారు. కాన్పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమాజ్ వాదీ పార్టీపై విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో పాలన గాడితప్పిందని విమర్శించారు. యూపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన ఆరోపించారు. కుటుంబాన్ని గాడినపెట్టుకోలేని వారు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. సమాజ్ వాదీ పార్టీ ముందు తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని ఆయన హితవు పలికారు. అఖిలేష్ ప్రభుత్వం యూపీలో శాంతి, భద్రతలను కాపాడడంలో విఫలమైందని ఆయన తెలిపారు. కుటుంబాన్ని చక్కదిద్దుకోలేనివారు రాష్ట్రంలో శాంతి, భద్రతలను ఎలా పరిరక్షిస్తారని ఆయన ప్రశ్నించారు.

More Telugu News