: సీఎం అభ్యర్థివి కాదు... కొడుకు అఖిలేష్ కు పెను షాకిచ్చిన ములాయం సింగ్ యాదవ్

వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుత సీఎం అఖిలేష్ యాదవ్ కు పెను షాకిచ్చే ప్రకటన చేశారు సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్. తదుపరి ఎన్నికల్లో పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండరని, ఎన్నికల తరువాత మెజారిటీ వస్తేనే ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలను బట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ ఎన్నుకుంటుందని నేటి మీడియా సమావేశంలో ఆయన ప్రకటించడం పార్టీలో సంచలనాన్ని సృష్టించింది. ఇప్పటివరకూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అఖిలేషే మినహా మరో పేరును కూడా ఊహించుకోని సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు, తమ అధినేత చెప్పిన మాటల వెనుక ఏ వ్యూహముందా? అని చర్చించుకుంటున్నారు. కాగా, పలు సంస్థలు ఎన్నికల సర్వేలు చేసి, ఈ దఫా యూపీలో హంగ్ అసెంబ్లీ వస్తుందని, సమాజ్ వాదీ పార్టీ అధికారాన్ని కోల్పోనుందని అంచనాలు వేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News