: ఉచిత కాల్స్ ఎలా ఇస్తారు?: జియోకు షాకిచ్చిన ట్రాయ్

నిమిషానికి రూ. 1.20 వాయిస్ టారిఫ్ అమలులో ఉండగా, ఉచిత కాల్స్ ఆఫర్ ఎలా ఇస్తారంటూ రిలయన్స్ జియోకు ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) ప్రశ్నాస్త్రాన్ని సంధించి షాకిచ్చింది. రెగ్యులేటరీకి సమర్పించిన రిపోర్టుకు, ప్రస్తుతం ప్రకటించిన ఆఫర్లకు చాలా తేడా ఉన్న కారణంగా జియోను వివరణ కోరినట్టు ట్రాయ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ట్రాయ్ ఉన్నతాధికారులు రిలయన్స్ జియో ప్రతినిధులతో భేటీ అయి, టారిఫ్ ప్లాన్ వివరాలు, ప్రైసింగ్ మోడల్ తదితరాలపై వివరాలు తెలుసుకుంటున్నారని వివరించాయి. కాగా, కాల్ ప్లాన్ కింద సెకనుకు 2 పైసలు చార్జ్ చేస్తామని రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపిన జియో, సిమ్ కార్డు బ్రోచర్లపైనా ఇదే విషయాన్ని ప్రచురించింది. ఇక ఉచిత కాల్స్ ఆఫర్ కు, ఈ టారిఫ్ ప్లాన్ కు మధ్య వ్యత్యాసంపై సంస్థ ఇప్పటివరకూ స్పందించలేదు. దీనికి సరైన సమాధానం జియో వద్ద లేదని ఇతర టెలికం కంపెనీలు ఆరోపిస్తున్నాయి. ఇదిలావుండగా, 2004లో ట్రాయ్ తయారు చేసిన టారిఫ్ ప్లాన్ల ప్రకారం, ఐయూసీ (ఇంటర్ కనెక్ట్ యూజర్ చార్జీలు) కన్నా తక్కువగా కాల్ టారిఫ్ ఉండేందుకు వీల్లేదు. ఇక ఇప్పుడు ఐయూసీ రేటు నిమిషం కాల్ కు 14 పైసలుండగా, అంతకన్నా తక్కువకు జియో కాల్స్ ఎలా అందిస్తుందన్నది ఎయిర్ టెల్, ఐడియా సహా టెల్కోల ప్రశ్న.

More Telugu News