: తిరుమలలో కాలినడక భక్తుల ఆందోళ‌న

తిరుమల తిరుప‌తిలో కొలువైన శ్రీ వేంక‌టేశ్వ‌రుడిని ద‌ర్శించుకోవ‌డానికి కాలిన‌డ‌క‌న‌ వ‌స్తోన్న భ‌క్తుల సంఖ్య అధికంగా ఉంది. బ్ర‌హ్మోత్స‌వాలు ముగిసిన‌ప్ప‌టికీ భ‌క్తుల ర‌ద్దీ అధికంగానే ఉంది. అయితే, ఈరోజు కాలినడక భక్తులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. నారాయ‌ణ గిరి ఉద్యాన‌వ‌నంలో క్యూ లైన్లలో నిల‌బ‌డిన వారు.. శ్రీ‌వారి ద‌ర్శ‌నం ఆలస్య‌మ‌వుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతేగాక‌, త‌మ‌కు స‌రైన వ‌స‌తి క‌ల్పించ‌డం లేద‌ని ఆందోళన వ్య‌క్తం చేశారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారుల‌ు వారికి న‌చ్చ‌జెప్పుతున్నారు.

More Telugu News