: కళ్లు తెరిచిన జయలలిత... ధ్రువీకరించిన వైద్యులు, తమిళనాట పూజలు, సంబరాలు

గత మూడు వారాలుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కళ్లు తెరిచారు. ఈ విషయం వెంటనే బయటకు పొక్కడంతో, ఆసుపత్రి ముందు అమ్మ అభిమానులు, రోజుల తరబడి వేచి చూస్తున్న ప్రజల్లో ఒక్కసారిగా ఆనందం పెల్లుబికింది. ఈ వార్తలను వైద్యులు సైతం ధ్రువీకరించారు. ఆమె కళ్లు తెరచి చూసిందని వైద్యులు స్పష్టం చేయడంతో, ఆమె మరింత త్వరగా కోలుకోవాలని ఓ వైపు ప్రత్యేక పూజలు చేస్తూనే, మరోవైపు సంబరాలను మొదలు పెట్టారు అమ్మ అభిమానులు. దీంతో అపోలో ఆసుపత్రి ఎదుట సందడి పెరిగింది. మరోవైపు నేడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, జయలలితను పరామర్శించేందుకు రానున్నారు. జయలలిత కళ్లు తెరిచారన్న వార్తల నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై నేడు వైద్యులు విడుదల చేసే బులెటిన్ పై ఆసక్తి నెలకొంది.

More Telugu News