: తూర్పుగోదావరి జిల్లా పొదలాడలో విషాదం.. లారీ ఢీ కొని అక్కాచెల్లెళ్లు దుర్మరణం

తూర్పుగోదావరి జిల్లా పొదలాడలో ఈరోజు తీవ్ర‌ విషాదం నెల‌కొంది. లారీ ఢీకొని అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దసరా పండుగకు బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఇద్ద‌రు బాలిక‌లు ఈ ప్ర‌మాదానికి గుర‌య్యారు. బాలిక‌ల త‌ల్లిదండ్రులు గ‌ల్ఫ్‌లో ఉంటున్నారు. ప్ర‌స్తుతం వారిరువురు వారి బంధువుల సంర‌క్ష‌ణ‌లో ఉంటున్న‌ట్లు తెలుస్తోంది. బాలిక‌ల‌ మ‌ర‌ణంతో కుటుంబంలో విషాదఛాయ‌లు అల‌ముకున్నాయి. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. గ‌ల్ఫ్ లోని వారి త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందించారు.

More Telugu News