: సికింద్రాబాద్ లో విషాదం.. మెట్రోరైల్ పిల్ల‌ర్ గుంత‌లో ప‌డి బాలుడు మృతి

సికింద్రాబాద్ మోండా మార్కెట్ వ‌ద్ద ఈ రోజు మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో హైద‌రాబాద్ మెట్రో రైలు ప‌నులు కొన‌సాగుతున్నాయి. అందులో భాగంగా మెట్రోరైల్ పిల్ల‌ర్ వేయ‌డానికి ఆ ప్రాంతంలో గుంత తీశారు. అయితే, అటువైపుగా వ‌చ్చిన ఓ బాలుడు ప్రమాద‌వశాత్తూ అందులో ప‌డ్డాడు. దీనిని గ‌మ‌నించిన మెట్రోరైలు సిబ్బంది, స్థానికులు బాలుడిని వెలికి తీశారు. అయితే అప్ప‌టికే బాలుడు మృతి చెందాడు. స‌ద‌రు బాలుడి వ‌య‌సు ఆరు సంవ‌త్స‌రాలుగా తెలుస్తోంది. దీనిపై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

More Telugu News