: ఇకపై హీరోయిన్లు తెలుగులో మాట్లాడకుంటే ఫంక్షన్ల నుంచి వాకౌట్ చేస్తా: దాసరి నారాయణరావు

తెలుగు చిత్ర పరిశ్రమ ఆంగ్ల చిత్ర పరిశ్రమగా మారిపోతోందని, ఆర్టిస్టులు ముఖ్యంగా హీరోయిన్లు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని ఆరోపించిన దర్శకరత్న దాసరి, హీరోయిన్లు తెలుగులో మాట్లాడకపోతే, తాను ఫంక్షన్స్ నుంచి వాకౌట్ చేసి నిరసన తెలుపుతానని హెచ్చరించారు. ఓ కొత్త చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన, ఏ భాష నుంచి వచ్చిన హీరోయిన్లయినా, వారిని తెలుగు పరిశ్రమ గౌరవిస్తుందని, కాబట్టి వారంతా తెలుగు నేర్చుకుని రావాలని తాను సిన్సియర్ సలహా ఇస్తున్నానని చెప్పారు. ఇప్పుడు వేదికపై ఉన్న హీరోయిన్లు రాయ్ లక్ష్మి, నికిషా పటేల్, అరుంధతీ నాయర్ లు తదుపరి స్టేజ్ ఎక్కేలోగా తెలుగులో మాట్లాడాలని, లేకుంటే ఆ సభ నుంచి తాను వెళ్లిపోతానని అన్నారు.

More Telugu News