: కందుల శివానందరెడ్డి కుమారుడిపై కడప పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి

కడప జిల్లాలో బీజేపీ నేత కందుల శివానందరెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డిపై వాసవి అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఉదయం వన్ టౌన్ పీఎస్ కు వచ్చిన ఆమె, తనను ఓబుల్ రెడ్డి మాయమాటలతో మోసపుచ్చి, పెళ్లి చేసుకుని ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడని కంప్లయింట్ ఇచ్చింది. గతంలో తాను శివానందరెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేశానని, ఆ సమయంలో ఓబుల్ రెడ్డితో పరిచయం ఏర్పడిందని, తనను ప్రేమించానని చెప్పిన ఓబుల్ రెడ్డి, ఇప్పుడు మోసం చేస్తున్నాడని చెప్పింది. వాసవి ఫిర్యాదుపై కందుల ఓబుల్ రెడ్డి ఇంతవరకూ స్పందించలేదు. కాగా, కేసు నమోదు చేసుకున్నామని, దర్యాఫ్తు చేస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

More Telugu News