: లండన్ లోని పాక్ హైకమిషన్ ముందు నిరసన... నినాదాలతో హోరెత్తించిన బలూచిస్థాన్ వాసులు

పాకిస్థాన్ లో అంతర్భాగాలుగా ఉన్న బలూచిస్థాన్, ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో ఆ దేశంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతాల్లో అరాచకాలను ఆపాలని, మానవహక్కులను హరించడం నిలిపివేయాలంటూ నిరసనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తమ హక్కుల కోసం పోరాడుతున్న ఈ ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో వారు తమ నిరసనలను మరింత ఉద్ధృతం చేశారు. ఈ క్రమంలో, లండన్ లోని పాకిస్థాన్ హైకమిషన్ ముందు గిల్గిత్, బలూచిస్థాన్, ఆక్రమిత కశ్మీర్ లలో పాక్ అరాచకాలకు స్వస్తి పలకాలంటూ బలూచిస్థాన్ వాసులు ఆందోళన చేశారు. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. పాక్ ప్రభుత్వం వెంటనే అరాచకాలను ఆపాలని డిమాండ్ చేశారు.

More Telugu News