: పదమూడేళ్ల తరువాత తొలిసారి... టాప్-4 నుంచి అవుటైన ఫెదరర్, నాదల్

సమకాలీన టెన్నిస్ చరిత్రలో ఇద్దరు దిగ్గజాలు, దాదాపు పదేళ్ల పాటు టెన్నిస్ రంగాన్ని శాసించిన స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ లు టాప్-4 నుంచి వైదొలిగారు. టాప్-4 లో వీరిద్దరిలో కనీసం ఒకరు కూడా లేకుండా ఏటీపీ ర్యాంకింగ్స్ విడుదల కావడం గడచిన 13 సంవత్సరాల్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ తొలి ర్యాంకును నిలబెట్టుకోగా, ఆపై ఆండీ ముర్రే, వావ్రింకా, నిషికోరిలు నిలిచారు. నాదల్ ఐదవ స్థానంలో, ఫెదరర్ 7వ స్థానంతో సరిపెట్టుకున్నారు. కాగా, నాదల్ 2014 తరువాత మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుచుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఫెదరర్ వింబుల్డన్ తరువాత టెన్నిస్ కు దూరమయ్యాడు.

More Telugu News