: నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ.. 15 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం

నెల్లూరు జిల్లాలో నేటి నుంచి రొట్టెల పండుగ ప్రారంభం కానుంది. బారాషహిద్ దర్గాలో ప్రారంభం కానున్న ఈ పండుగలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఈ ఏడాది ఉత్సవంలో 15 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా, కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, శ్రీలంక తదితర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. నేడు ప్రారంభం అవుతున్న ఈ పండుగ మూడు రోజులు పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులు ఇక్కడికొచ్చి రొట్టెలను పంచుకోవడం వల్ల వారి కోర్కెలు తీరుతాయని విశ్వాసం.

More Telugu News