: తెలంగాణలో సరికొత్త అధ్యాయం... 21 కొత్త జిల్లాల ప్రారంభం

దశాబ్దాల పోరాట ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంది. 21 కొత్త జిల్లాలకు ఉదయం 11.13 గంటలకు ప్రారంభోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రజల ఆనందం అంబరాన్ని తాకింది. పవిత్ర విజయదశమి రోజున... కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణ మరింత దేదీప్యమానంగా వెలుగొందింది. సిద్ధిపేట జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆయనకు తోడుగా మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఇతర జిల్లాలను ప్రారంభించిన వారి వివరాలు ఇవే... మెదక్ - డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మంచిర్యాల - పద్మారావు వికారాబాద్ - మహేందర్‌ రెడ్డి సూర్యాపేట - జగదీష్‌ రెడ్డి కొత్తగూడెం - తుమ్మల నాగేశ్వరరావు నిర్మల్ - ఇంద్రకరణ్‌ రెడ్డి సిరిసిల్ల (రాజన్న) - కేటీఆర్ ఆసిఫాబాద్ - జోగు రామన్న జనగామ - మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ వరంగల్ (రూరల్)- డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి యాదాద్రి - నాయిని నర్సింహారెడ్డి పెద్దపల్లి - ఈటల రాజేందర్ కామారెడ్డి - పోచారం శ్రీనివాస్ రెడ్డి జోగులాంబ - లక్ష్మారెడ్డి మేడ్చల్ (మల్కాజిగిరి) - తలసాని శ్రీనివాస్ యాదవ్ జయశంకర్ - స్పీకర్ మధుసూదనాచారి జగిత్యాల - డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ వనపర్తి - ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి నాగర్ కర్నూలు - జూపల్లి కృష్ణారావు మహబూబాబాద్ - చందూలాల్ కొత్త జిల్లాల ఏర్పాటుతో... తెలంగాణలో పరిపాలన మరింత మెరుగ్గా ఉంటుందని నేతలతో పాటు సామాన్యులు కూడా భావిస్తున్నారు.

More Telugu News