: తెలంగాణ లో కొత్త జిల్లాలకు కలెక్టర్లు వీరే!

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన 21 కొత్త జిల్లాలకు కలెక్టర్లను ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాలను దసరా మహోత్సవం రోజునే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రారంభించనున్నారు. కాగా, ఆయా జిల్లాలకు కలెక్టర్లుగా నియమితులైన వారి వివరాలు.. * జోగులాంబ - రజత్ కుమార్ షైనీ * వనపర్తి - శ్వేతా మహంతి * నాగర్ కర్నూల్ - ఇ.శ్రీధర్ * వికారాబాద్- దివ్య * మల్కాజ్ గిరి - ఎంవీ రెడ్డి * నిర్మల్ - ఇలంబర్తి * ఆచార్య జయశంకర్ - ఏ.మురళి * యాదాద్రి - అనితా రామచంద్రన్ * వరంగల్ రూరల్ - ప్రశాంత్ * సిద్దిపేట - వెంకట్రామిరెడ్డి * పెద్దపల్లి - అలగు వర్షిణి * సిరిసిల్ల - కృష్ణ భాస్కర్ * సూర్యాపేట - సురేంద్ర మోహన్ * కామారెడ్డి- సత్యనారాయణ * జగిత్యాల - శరత్ * వరంగల్ అర్బన్ - అమ్రపాలి * ఆసిఫాబాద్ - చంపాలాల్ * జనగామ - దేవ సేన * మంచిర్యాల- ఆర్వీ కర్నన్ * సంగారెడ్డి - మాణిక్ రాజ్ * భద్రాద్రి - రాజీవ్ జి హనుమంతు

More Telugu News