: పాక్ ను హెచ్చరించిన భారత జవాన్ కు బెదిరింపులు

భారత్ తో పెట్టుకుంటే ప్రపంచపటంలో పాకిస్థాన్ రూపు రేఖలు కనిపించకుండా పోతాయంటూ తన గీతాలాపన ద్వారా దేశభక్తి చాటుకున్న భారత జవాన్ మనోజ్ ఠాకూర్ ను ఎవరూ మర్చిపోలేరు. యూరీ సెక్టార్ పై ఉగ్ర దాడి అనంతరం పాకిస్థాన్ తీరుపై తన నిరసన వ్యక్తం చేస్తూ మనోజ్ ఆ గీతాన్ని ఆలపించాడు. జవాన్లతో నిండిన బస్సులో వెళుతుండగా పాడిన ఆ గీతం వైరల్ గా మారి నెటిజన్ల ప్రశంసలందుకుంది. అయితే, మనోజ్ ఠాకూర్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని తోటి సైనికులు అంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.

More Telugu News