: రెండో డిబేట్ లోనూ హిల్లరీ దే పైచేయి... హిల్లరీకి 3.56 పాయింట్లు, ట్రంప్ కు 2.59 పాయింట్లు

తన నోటి దురుసుతనంతో అధ్యక్ష పదవికి దూరమవుతున్న ట్రంప్, రెండో బిగ్ డిబేట్ లోనూ హిల్లరీపై ఏ మాత్రం ఆధిక్యాన్ని చూపలేకపోయారు. తాజాగా జరిగిన ముఖాముఖిలో సైతం, గెలిస్తే తానేం చేస్తానన్న విషయాన్ని పక్కనబెట్టిన ఇరువురు నేతలూ, వ్యక్తిగత విమర్శలకు సమాధానం చెప్పుకోవడానికే పరిమితమయ్యారు. ఇక ఈ డిబేట్ అనంతరం ఓ టీవీ చానల్ పోల్ నిర్వహించగా, అత్యధికులు హిల్లరీవైపు నిలిచారు. 5 పాయింట్లకు గాను హిల్లరీకి సరాసరిన 3.56, ట్రంప్ కు 2.59 పాయింట్లు లభించాయి. తొలి డిబేట్ లోనూ హిల్లరీ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాలు ట్రంప్ కు వ్యతిరేకంగా మారడంతో హిల్లరీ శిబిరం ఆనందంగా ఉంది.

More Telugu News