: పాకిస్థాన్ కోడ్‌తో ప.గో.వాసులకు ఫోన్ కాల్స్.. వణికిపోతున్న ప్రజలు

పాకిస్థాన్ కోడ్ నంబరుతో వస్తున్న ఫోన్ కాల్స్‌తో పశ్చిమ గోదావరి జిల్లావాసులు వణికిపోతున్నారు. ఎందుకొస్తున్నాయో తెలియక భయపడుతున్నారు. నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాలకు +92 3045414385 నంబరుతో తరచూ ఫోన్లు వస్తున్నాయి. దీంతో ఆ కాల్స్‌ను లిఫ్ట్ చేసేందుకు వినియోగదారులు భయపడుతున్నారు. ఇక్కడి సమాచారాన్ని సేకరించేందుకు పాకిస్థాన్ హ్యాకర్లే ఈ కాల్స్ చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో భారత ఆర్మీ నుంచి వస్తున్న హెచ్చరికలు కూడా వీరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఫోన్ కాల్స్ వెనక ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

More Telugu News