: ఇండోర్ టెస్టు: సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ

న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ ఇండియా టూర్‌లో భాగంగా ఇండోర్ వేదిక‌గా ఈరోజు కొన‌సాగుతున్న మూడో టెస్టు మొద‌టి ఇన్సింగ్స్ లో టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్, కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అద‌ర‌గొట్టాడు. చ‌క్క‌గా రాణించి సెంచ‌రీ సాధించాడు. మ‌రోవైపు ర‌హానే క్రీజులో కూడా నిల‌దొక్కుకొని 71 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు. టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్ మెన్ విఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిందే. మిడిల్ ఆర్డ‌ర్‌లో వ‌చ్చిన ర‌హానే, కోహ్లీ అద్భుతంగా రాణించారు. టీమిండియా స్కోర్ 257 (85 ఓవ‌ర్ల‌కి). సెహ్వాగ్ కి టెస్టుల్లో ఇది పదమూడవ సెంచరీ.

More Telugu News