: టీడీపీ పరువు తీసిన శిక్షణా తరగతుల ఫోటో!

రాజకీయనాయకుల్లో సాంకేతిక సౌకర్యాలను వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న పేరు ప్రతిష్ఠలు మరే రాజకీయ నాయకుడికి లేవంటే అతిశయోక్తి కాదు. ఏం చేసినా అందులో సాంకేతిక సహకారం ఉండాలని చంద్రబాబు ఆరాటపడుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు తమ్ముళ్లకు సాంకేతిక అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహించారు. అనంతరం ఈ శిక్షణా తరగతులకు సంబంధించిన పలు ఫోటోలు మీడియాకు విడుదల చేశారు. ఇందులో గద్దె రామ్మోహన్ ఫోటో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ ఫోటోలో ఆకట్టుకునే అంశం ఏంటంటే... మానిటర్ కూడా ఆన్ చేయకుండా ఆయన శ్రధ్ధగా సాంకేతిక శిక్షణాపాఠాలు వినడం సర్వత్రా విమర్శలపాలవుతోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చేస్తూ...తెలుగు తమ్ముళ్లకు ప్రచారం పిచ్చి ఏ స్థాయిలో ఉందో చూడండంటూ వైరల్ అవుతోంది.

More Telugu News