: సల్మాన్ భట్, మొహ్మద్ ఆసిఫ్ లకు ఊరట

పాకిస్థాన్ క్రికెటర్లు సల్మాన్ భట్, మెహ్మద్ ఆసిఫ్ లకు ఊరట లభించింది. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో ఐదేళ్లపాటు సస్పెన్షన్ కు గురైన వీరిద్దరికీ రెండవ పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడేందుకు పీసీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐదేళ్ల నిషేధ కాలం పూర్తయినప్పటికీ... పీఎస్ఎల్ తొలి సీజన్ లో ఆడే అవకాశం వీరికి దక్కలేదు. ఇప్పుడు క్లియరెన్స్ రావడంతో, సెకండ్ సీజన్ వేలం పాటలో వీరిద్దరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి సీజన్ నాటికే వీరిపై నిషేధం పూర్తయింది. అయితే, నిషేధం పూర్తయ్యే సమయానికి ఆటగాళ్ల వేలంపాట కూడా పూర్తయింది. దీంతో, అవకాశం ఉన్నప్పటికీ ఆడే అవకాశం వీరికి దక్కలేదు. ఈ సందర్భంగా సల్మాన్ భట్ మాట్లాడుతూ, పీసీబీ నిర్ణయం చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు. తాము చేసిన తప్పులు గతమని... ఇకపై అంతా మంచే జరుగుతుందని చెప్పాడు.

More Telugu News