: చిందేసిన ‘జబర్దస్త్’ రష్మి.. ఊగిపోయిన కుర్రకారు

టీవీ రియాలిటీ షో 'జబర్దస్' ఫేం రష్మి వేసిన చిందులకు కుర్రకారు మత్తెక్కినట్టు ఊగిపోయారు. ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. శ్రీ అచ్యుత ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘తను వచ్చెనట’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలోని చెయ్యేరు ఇంజినీరింగ్ కళాశాలకు చిత్ర బృందం చేరుకుంది. వీరికి కళాశాల విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకట్ అచ్యుత్, కథానాయికి రష్మి గౌతమ్‌లు చిత్ర విశేషాలను వివరించారు. డైరెక్టర్ వెంకట్ మాట్లాడుతూ జాంబీ కథనంతో ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలిపారు. సినిమా షూటింగ్ పూర్తయిందని, ఈనెల 14న విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మి వేసిన చిందులకు విద్యార్థులు వెర్రెత్తిపోయారు. ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. వారు కూడా ఆమెతో కలిసి చిందేశారు.

More Telugu News