: న్యూజిలాండ్‌తో తలపడే వన్డే జట్టులో రైనాకు చాన్స్.. యూవీకి మొండిచేయి

న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మూడు వన్డేలకు సెలక్టర్లు భారత జట్టును గురువారం ప్రకటించారు. తుది జట్టులో యువ క్రికెటర్ మనీశ్ పాండే, హార్థిక్ పాండ్యాలకు అవకాశం కల్పించిన ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్టర్లు సీనియర్ ఆల్‌రౌండర్, డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌కు మొండిచేయి చూపించారు. దులీప్ ట్రోఫీతో ఫామ్ లోకి వచ్చిన సురేశ్ రైనాను దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి తీసుకున్నారు. టెస్ట్ సిరీస్‌లో గాయపడిన శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్‌తోపాటు సీనియర్ పేస్ బౌలర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి ఇచ్చారు. వన్డే సిరీస్ ఈ నెల 16 నుంచి మొదలు కానుంది. భారత జట్టు: మహేంద్రసింగ్ ధోని(కెప్టెన్), రోహిత్ శర్మ, అజింక్య రహానె, విరాట్ కోహ్లీ, మనీశ్ పాండే, సురేశ్ రైనా, హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, అమిత్ మిశ్రా, జస్‌ప్రీత్ బుమ్రా, ధవళ్ కులకర్ణి, ఉమేశ్ యాదవ్, మన్‌దీప్ సింగ్, కేదార్ జాదవ్.

More Telugu News