: ఆర్జేడీ అధినేత లాలూను కలిసిన నిందిత ఎమ్మెల్యే

అత్యాచారం కేసులో బెయల్ పై ఇటీవల విడుదలైన ఆర్జేడీ నాయకుడు రాజ్ బల్లభ్ ఈరోజు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను కలిశారు. కాగా, పదిహేనేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై జైలుకు వెళ్లిన ఆర్జేడీ నాయకుడు రాజ్ బల్లభ్ తాజాగా హైకోర్టు బెయిల్ పై విడుదలయ్యారు. బీహార్ ప్రభుత్వం ఈ బెయిల్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను రాజ్ బల్లభ్ కలిసినట్లు సమాచారం. అత్యాచారం ఆరోపణలు కారణంగా రాజ్ బల్లభ్ ను ఆర్జేడీ నుంచి సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా, రాజ్ బల్లభ్ కు బెయిల్ లభించడంపై ఈ కేసులో బాధితురాలితో పాటు బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ బల్లభ్ జైలు నుంచి బయటకు రావడంతో తనకు, తన కుటుంబానికి చాలా భయంగా ఉందని... పేర్కొంటూ ముఖ్యమంత్రికి, పలువురు పాత్రికేయులకు బాధితురాలు మెస్సేజ్ లు పెట్టడం విదితమే.

More Telugu News