: దారిలోకి వస్తారా? లేదా దారిలో పెట్టాలా?... బీసీసీఐకి సుప్రీంకోర్టు అల్టిమేటం

బీసీసీఐకి దేశ సర్వోన్నత న్యాయస్థానం అల్టిమేటం ఇచ్చింది. ఆర్ఎం లోథా కమిటీ సూచించిన అన్ని సంస్కరణలనూ తుచ తప్పకుండా అమలు చేయాలని సూచించింది. "మా సమయం వృథా చేయకండి. లోథా కమిటీ సూచనలను అమలు చేస్తామని చెప్పండి. లేదా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది" అంటూ బీసీసీఐని సుప్రీంకోర్టు హెచ్చరించింది. దీనికి సమాధానంగా... అక్టోబర్ 17న తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని సుప్రీంకు బీసీసీఐ తెలిపింది. ఇదే సమయంలో బీసీసీఐకి సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. లోథా కమిటీ సిఫారసులను అమలు చేయడానికి అంగీకరించని క్రికెట్ సంఘాలకు నిధులను విడుదల చేయవద్దని సూచించింది. హడావుడిగా నిధులను పంపిణీ చేయాల్సిన అవసరం ఏముందని బీసీసీఐని ప్రశ్నించింది. "మీరు లార్డ్స్ లా ప్రవర్తిస్తున్నారు. దారిలోకి వచ్చే ప్రయత్నం చేయండి. లేకపోతే మేమే మిమ్మల్ని దారిలో పెట్టాల్సి ఉంటుంది" అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం బీసీసీఐని హెచ్చరించింది.

More Telugu News