: రోశయ్యతో ముద్రగడ భేటీ.. మద్దతు కోరిన కాపునేత

కాపు వర్గానికి రిజర్వేషన్ల సాధన కోసం పోరాడుతున్న కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హైదరాబాదులో పలువురు నేతలను కలుస్తూ బిజీబిజీగా ఉన్నారు. నిన్న కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, వైసీపీ నేతలు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణలతో పాటు పలువురు నేతలతో భేటీ అయిన ఆయన ఈరోజు తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి రోశయ్యతో భేటీ అయ్యారు. తమ ఉద్య‌మానికి మ‌ద్దతు ఇవ్వాల్సిందిగా ఆయ‌న రోశయ్య‌ను కోరిన‌ట్లు తెలుస్తోంది.

More Telugu News