: కేజ్రీవాల్ పై మళ్లీ ఇంకు దాడి...ఈసారి ఏబీవీపీ నేత

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై మరోసారి ఇంకు దాడి జరిగింది. గత జనవరిలో మీడియా సమావేశంలో ఉండగా, ఆప్ కు దూరమైన ఓ మహిళ కేజ్రీవాల్ పై ఇంకు పోసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజస్థాన్ పర్యటనలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ పై బికనీర్‌ లో ఏబీవీపీకి చెందిన దీనేష్ ఓఝా అనే యువకుడు ఇంకు దాడి చేశాడు. ఆప్ కు చెందిన స్థానిక నేత శంకర్ సేవాదాస్ కుటుంబాన్ని పరామర్శించేందుకు అరవింద్ కేజ్రీవాల్ వెళ్లారు. ఈ సందర్భంగా రాత్రి పది గంటల సమయంలో అతని నివాసం నుంచి బయటకు వస్తుండగా దినేష్ ఓఝా, కేజ్రీవాల్ ను జాతి వ్యతిరేకి అని ఆరోపిస్తూ, ఆయన ముఖంపై ఇంకు పోశారు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ట్వీట్ చేసిన కేజ్రీవాల్ 'నా మీద ఇంకు పోసిన వాళ్లను దేవుడు ఆశీర్వదించా'లని కోరారు. సర్జికల్ దాడుల వీడియో బయటపెట్టాలని కేజ్రావాల్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు భావిస్తుండగా, బీజేపీ ఇలాంటి కుటిల యత్నాలు మానుకోవాలని ఆప్ నేతలు సూచిస్తున్నారు.

More Telugu News