: రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

రాగల రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోను భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని, అది బలపడే అవకాశం ఉందని చెప్పింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఓ మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, పలు చోట్ల చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాదు వాతావరణ కేంద్రం సూచించింది.

More Telugu News