: స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ పై లీటర్ కు 14 పైసలు, డీజిల్ పై లీటర్ కు 10 పైసలు పెరిగింది. డీలర్ల కమీషన్ పెంపు కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పేర్కొంది. కాగా, పెరిగిన ధరలు ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలు కానున్నాయి. పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 64.72 పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.52.61గా ఉంది.

More Telugu News