: న్యూజిలాండ్‌తో సిరీస్ ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం లేదు: స్పష్టం చేసిన జ‌స్టిస్ లోథా

న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ భార‌త్‌లో ప‌ర్య‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. టీమిండియా-న్యూజిలాండ్ టీమ్‌ల మ‌ధ్య మ‌రో టెస్టు మ్యాచ్, ఐదు వ‌న్డే మ్యాచులు జ‌ర‌గాల్సి ఉంది. అయితే, లోథా క‌మిటీ సూచించిన సిఫార్సుల‌ను బీసీసీఐ పాటించ‌డం లేదంటూ బోర్డుపై సుప్రీంకోర్టు ఇటీవ‌లే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ప‌లు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బీసీసీఐ కూడా బెట్టుగా ఉండడంతో భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య మ్యాచులు ర‌ద్దయ్యే అవ‌కాశం ఉంద‌ని పలువురు భావించారు. దీనిపై ఈరోజు స్పందించిన జ‌స్టిస్ లోథా న్యూజిలాండ్‌తో సిరీస్ ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం లేదని మీడియాకు తెలిపారు. రోజువారీ వ్యవహారాలకు నిధులు వెచ్చించకూడ‌ద‌ని బీసీసీఐకి చెప్పలేదని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్రాల‌ క్రికెట్ సంఘాలకు ఎక్కువ మొత్తంలో నిధులు ఇవ్వ‌కూడ‌ద‌ని మాత్ర‌మే తాము చెప్పిన‌ట్లు పేర్కొన్నారు.

More Telugu News