: చూస్తుండండి, వచ్చే ఎన్నికల తరువాతా మనమే ఉంటాం!: బల్లగుద్ది చెప్పిన కేసీఆర్

మరో రెండున్నరేళ్ల తరువాత 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయాన్ని సాధిస్తుందని పార్టీ నేతలతో కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్య నేతలతో సమావేశమైన వేళ, రాష్ట్రంలో విపక్షాలు సైతం మళ్లీ టీఆర్ఎస్ వస్తుందని చర్చించుకుంటున్నాయని కేసీఆర్ తెలిపారు. అందువల్లే అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల విషయంలో ఏడెనిమిదేళ్లకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. ఇప్పటివరకూ వచ్చిన ప్రతి ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్ దేనని, సరైన ఆలోచనలు, వృద్ధి అడుగులు ఇందుకు కారణమని వ్యాఖ్యానించిన ఆయన, అన్ని ప్రభుత్వాలు పనిచేసినట్లుగా రొటీన్ గా పనిచేయడం వల్ల లాభం ఉండదని, మార్పును తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తూ, ప్రతి ఎకరాకూ నీటిని అందించే కల సాకారానికి పని చేయాలని అన్నారు. వచ్చే మూడు నాలుగేళ్లలో పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టనున్నామని, వాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు.

More Telugu News