: అఖిలేష్, శివపాల్ మధ్య కొత్త వివాదం!

ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్, యూపీ ఎస్పీ చీఫ్ శివపాల్ సింగ్ యాదవ్ మధ్య కొత్త వివాదం తలెత్తింది. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇంట్లో ఈరోజు జరిగిన సమావేశంలో అఖిలేష్, శివపాల్ పాల్గొన్నారు. వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శివపాల్ యాదవ్ తొమ్మిది మంది ఎస్పీ అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా, మరో 14 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. ఈ క్రమంలో హత్య కేసులో నిందితుడిగా ఉన్న అమర్ మణి త్రిపాఠి కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. అయితే, అఖిలేష్ కు తెలియకుండానే ఈ జాబితా విడుదల చేశారని, దీంతో, ఆయన అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. తనకు ఎటువంటి సమాచారం లేకుండానే ఈ జాబితా తయారు చేశారని, భవిష్యత్ లో చాలా మంది అభ్యర్థులను మారుస్తామని అఖిలేష్ చెప్పినట్లు సమాచారం. కాగా, పార్టీ విషయాలకు సంబంధించి అఖిలేష్ యాదవ్, ఆయన బాబాయి శివపాల్ మధ్య గతంలో ఏర్పడ్డ వివాదానికి ములాయం జోక్యంతో చెక్ పెట్టారు. తాజాగా, అబ్బాయి, బాబాయి మధ్య మరో వివాదం ఏర్పడింది.

More Telugu News