: షాకింగ్ న్యూస్... చైనాలో ఘోరం.. తల్లిదండ్రులతో సహా 19 మందిని హత్యచేశాడు

చైనాలో ఘోరం చోటుచేసుకుంది. యునాన్ ఫ్రావిన్స్ రాజధాని కున్ మింగ్ లో చిన్నపాటి ఉద్యోగం చేస్తోన్న యాంగ్ జింగ్ పె (27) అనే యువకుడు చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. దీంతో దొరికిన చోటల్లా ఎడాపెడా అప్పులుచేశాడు. అవి తీర్చలేని స్థితిలో, వారంతా ఒత్తిడి చేయడంతో డబ్బు కోసం సొంత ఊరికి వెళ్లాడు. తాను చేసిన అప్పులు తీర్చాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేశాడు. వ్యసనాల బారిన పడ్డ కుమారుడు చేసిన అప్పులు తీర్చేందుకు వారు అంగీకరించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన యాంగ్ జింగ్ పె తల్లిదండ్రులిద్దర్నీ అత్యంత దారుణంగా హత్య చేశాడు. పోలీసు విచారణలో తన వివరాలు పక్కింటి వాళ్లు చెప్పే అవకాశం ఉందని భావించి వారిని కూడా చంపేశాడు. ఇలా తనను అనుమానించే ప్రతి ఒక్కరినీ చంపేశాడు. ఇలా ముగ్గురు చిన్నపిల్లలు సహా మొత్తం 19 మందిని హత్య చేశాడు. అనంతరం ఏమీ తెలియనట్టు కున్ మింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చైనాలో సామూహిక హత్యోదంతాలు వరుసగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా 'యాంగ్ జింగ్ పె'ను అనుమానితుడిగా తీసుకుని తమదైన శైలిలో విచారించగా 19 మందిని హత్య చేసినట్టు అంగీకరించాడు. దీంతో అంతా షాక్ కు గురయ్యారు. అతనికి మరణశిక్ష విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

More Telugu News