: బతుకమ్మ ఆడిన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ బతుకమ్మ ఆడి అందర్నీ ఆకట్టుకున్నారు. హైదరాబాదులోని తెలంగాణ సచివాలయం ఉద్యోగులు సచివాలయంలో బతుకమ్మ పండగను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులంతా బతుకమ్మ ఆడి సందడి చేశారు. దీంతో సచివాలయ మహిళా ఉద్యోగులతో కలిసి స్వామిగౌడ్ బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు. దీంతో అంతా హర్షం వ్యక్తం చేశారు. కాగా, గతంలో స్వామిగౌడ్ ఉద్యోగసంఘ నేతగా విజయవంతమైన సంగతి తెలిసిందే.

More Telugu News