: కీవీస్ పై విజయభేరీతో టెస్టుల్లో మళ్లీ మనమే నెంబరు వన్.. పాక్ ను వెనక్కి నెట్టిన టీమిండియా
న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు చెలరేగి ఆడడంతో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో టెస్టు ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఇంతవరకు 111 రేటింగ్స్ తో అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్ రెండో స్థానానికి పడిపోయింది. ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా (108 రేటింగ్స్), నాలుగో స్థానంలో ఇంగ్లండ్(108), ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా(108), ఆరో స్థానంలో శ్రీలంక(96) ఉన్నాయి. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ను టీమిండియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మరో టెస్టు మిగిలి ఉండగానే సీరీస్ ను సొంతం చేసుకోవడం, టీమిండియా మళ్లీ మొదటిస్థానానికి రావడం పట్ల భారత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.