: పుల్లెల గోపీచంద్ పై బయో పిక్.. ఆ పాత్రలో సుధీర్ బాబు!

ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పై త్రిభాషా చిత్రం తెరకెక్కనుంది. ‘చందమామ కథలు’ చిత్రం ద్వారా జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. కాగా, గోపీచంద్ పాత్రను ప్రముఖ నటుడు సుధీర్ బాబు పోషించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సుధీర్ బాబు నటుడు కాకముందు గోపీచంద్ వద్ద కొన్నాళ్ల పాటు బ్యాడ్మింటన్ లో శిక్షణ తీసుకున్నాడు. అందుకే, గోపీచంద్ పాత్రను సుధీర్ బాబు పోషిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

More Telugu News