: ఇబ్రహీంపట్నం చౌరస్తాలో పేలుడు...ఎవరి పని?

హైదరాబాదు శివార్లలోని ఇబ్రహీంపట్నం చౌరస్తాలో పేలుడు సంభవించింది. స్కూటర్ డిక్కీలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో ఇబ్రహీంపట్నం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పేలుడు తీవ్రత తక్కువగా ఉందని వారు వెల్లడించారు. కాగా, సరిహద్దుల్లో పాక్ తో ఉద్రిక్తతలు, రెండు రోజలు క్రితం రాజధానిలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ వేళ్లూనుకుందని, ఎస్ఎమ్ కళాశాలలో శిక్షణా తరగతులు కూడా నిర్వహించిందని, సేవ్ మై కంట్రీ అని పేర్కొంటూ ఆ కళాశాలలో లెక్చరర్ గా పని చేసే ప్రవీణ్ కుమార్ తన ఫేస్ బుక్ లో పేర్కొన్న నేపథ్యంలో పేలుడు సంభవించడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.

More Telugu News