: వనస్థలిపురంలో దొంగల బీభత్సం.. వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ

హైదరాబాద్ శివారు వనస్థలిపురంలోని పురాతన వెంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో దొంగలను నిలువరించేందుకు ప్రయత్నించిన వాచ్‌మన్‌పై దాడిచేశారు. వారి దాడిలో వాచ్‌మన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.

More Telugu News