: భారత సైన్యం దాడుల్లో మృతి చెందిన ‘పాక్’ ఉగ్రవాదుల మృతదేహాలకు రహస్య ఖననం

భారత సైన్యం జరిపిన నిర్దేశిత దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల మృతదేహాలను పాకిస్థాన్ ఆర్మీ ఈరోజు రహస్యంగా ఖననం చేసినట్లు సమాచారం. ఈ దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదులు ‘జైషే-ఇ-మహ్మద్’, ‘లష్కర్-ఏ-తోయిబా’,‘హిజ్బుల్ ముజాహిదీన్’ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారని తెలుస్తోంది. దాడి జరిగిన ప్రాంతాలకు సమీపంలోనే వారి మృతదేహాలను ఖననం చేశారని, ఈ పనులన్నింటిని పాక్ ఆర్మీ హడావుడిగా ముగించిందని భారత నిఘా వర్గాల సమాచారం.

More Telugu News