: అదొక బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్.. నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను: ఎంపీ కవిత

‘తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా తొమ్మిదేళ్లలో ఎన్నో వేల మంది మహిళలను ప్రత్యక్షంగా కలిశాను. అదొక బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్ గా.. అదృష్టంగా భావిస్తున్నాను’ అని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎంపీ కవిత చెప్పారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, బతుకమ్మ అంటే తెలంగాణ గుర్తొచ్చేలా చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా 11 వందల చోట్ల జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమవడం, వారికి సేవ చేయడం జరుగుతోందని అన్నారు. బతుకమ్మ ఉత్సవాలను విశ్వవ్తాప్తం చేస్తున్నామని, ఈసారి 9 దేశాల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

More Telugu News