: అనంతపురం కలెక్టరేట్ వద్ద 4న వైఎస్ జగన్ మహాధర్నా

వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల 4వ తేదీన అనంతపురం కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి మహా ధర్నా నిర్వహించనున్నారు. రైతు సమస్యలపై టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ ఈ మహాధర్నా నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ పేర్కొన్నారు. ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.

More Telugu News