: యుద్ధం వస్తే మనదే పైచేయి.. తేల్చి చెప్పిన అమెరికా గూఢచార సంస్థ

సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న టెన్షన్ నేపథ్యంలో ఉద్రికత్తలు మరింత పెరిగి అది యుద్ధానికి దారితీస్తే గెలిచేదెవరు? ఎవరి వద్ద ఎన్నెన్ని ఆయుధాలు ఉన్నాయి? ఇరు దేశాల మధ్య ఉన్న సైన్యం ఎంత? తదితర వివరాలను అమెరికా గూఢచార సంస్థ సీఐఏ వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం చూస్తే.. భారత్ వద్ద 13,25,000 మందితో బలమైన సైన్యం ఉండగా, దాయాది పాకిస్థాన్ సైన్యం 6.20 లక్షలు మాత్రమే. భారత్ రిజర్వ్ సైన్యం 21.43లక్షలు కాగా పాకిస్థాన్‌ది 5.15 లక్షలు. యుద్ధ విమానాలు భారత్ వద్ద 2,086 ఉండగా పాకిస్థాన్ వద్ద అవి 923 మాత్రమే ఉన్నాయి. హెలికాప్టర్లు భారత్ వద్ద 646 ఉండగా పాక్ వద్ద కేవలం 306 మాత్రమే ఉన్నాయి. అటాక్ హెలికాప్టర్ల విషయంలో మాత్రం మనకంటే పాకిస్థాన్ మరింత మెరుగ్గా ఉంది. ఇవి భారత్ వద్ద 19 మాత్రమే ఉండగా దాయాది వద్ద 52 ఉన్నాయి. అటాక్ ఎయిర్ క్రాఫ్ట్‌ల విషయంలో మాత్రం మనదే పైచేయి. మన వద్ద 809 ఉన్నాయి. పాకిస్థాన్ వద్ద 394 మాత్రమే ఉన్నాయి. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌లు భారత్ వద్ద 679, పాక్ వద్ద 304 ఉన్నాయి. ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్‌లు మనవద్ద 857 ఉండగా శత్రుదేశం వద్ద 261 ఉన్నాయి. యుద్ధ ట్యాంకుల విషయంలోనూ దాయాది కంటే మనదే పైచేయి. మనవద్ద అవి 6,464 ఉండగా పాక్ వద్ద 2,924 మాత్రమే ఉన్నాయి. ఆర్మ్‌డ్ ఫైటింగ్ వాహనాలు భారత్ వద్ద 6,704, పాక్ వద్ద 2,828 ఉన్నాయి. విమాన వాహక నౌకలు మనవద్ద రెండు ఉండగా పాక్ వద్ద అసలు లేవు. మన వద్ద యుద్ధనౌకలు 295 ఉన్నాయి. పాక్ వద్ద 197 ఉన్నాయి. జలాంతర్గాములు భారత్ వద్ద 14 ఉండగా పాకిస్థాన్ వద్ద 5 ఉన్నట్టు సీఐఏ గణాంకాలు చెబుతున్నాయి.

More Telugu News