: షరీఫ్‌కు పాలనాదక్షత లేదు.. మోదీని ఎలా ఎదుర్కోవాలో ఆయనకు నేను చెబుతా: ఇమ్రాన్ ఖాన్

ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పాలనా దక్షత లేదని, భారత్ సర్జికల్ స్ట్రయిక్స్‌పై ఎలా స్పందించాలో ఆయనకు తాను చెబుతానని పాక్ మాజీ క్రికెటర్, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఎలా స్పందించాలో తనకు తెలుసునని ఈరోజు (శుక్రవారం) పంజాబ్ ప్రావిన్స్‌లో నిర్వహించనున్న మార్చ్‌లో ఆ విషయాన్ని చెబుతానని ఆయన పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్‌కు ప్రాథమికంగా ఓ సందేశం ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పిన ఇమ్రాన్ భారత ప్రధాని నరేంద్రమోదీకి కూడా శుక్రవారం ఓ సందేశం పంపిస్తానన్నారు. తాను చేపట్టబోయే మార్చ్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యత చూపాలని కోరారు. మరోవైపు షరీఫ్‌పై విరుచుకుపడిన ఇమ్రాన్‌ఖాన్ ఆయనకు పాలనా దక్షత లేదని విమర్శించారు. ప్రస్తుతం పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

More Telugu News