: భారత ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్ పై అజ్మీర్ దర్గా చీఫ్ స్పందన

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ లో ఉగ్రవాద శిబిరాలపై భారత సైనిక, వాయు సేనలు సంయుక్తంగా సమన్వయంతో మెరుపుదాడులు చేయడంపై ముస్లిం మత పెద్దలు స్పందించారు. అజ్మీర్ దర్గా చీఫ్ సయ్యద్ జైనుల్ అబేదిన్ ఇండియన్ ఆర్మీ దాడులపై హర్షం వ్యక్తం చేశారు. ఇండియన్ ఆర్మీ శత్రుదేశంలో చొరబడి, విజయవంతంగా ఉగ్రవాదులను హతమార్చిందని అన్నారు. ఇండియన్ ఆర్మీ పాకిస్ధాన్ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పిందని ఆయన పేర్కొన్నారు.

More Telugu News